ఎడమచేతితో చేసిన దానం.. కుడిచేతికి తెలియకూడదు అన్న సామెతను మనం చిన్నతనం నుంచి వింటూనే ఉన్నాం.
అయితే సాయం చేసిన మనిషి దాని గురించి చెప్పుకోకపోవచ్చు అది వారి సంస్కారం, మంచితనం.
కానీ సాయం పొందిన వ్యక్తి మాత్రం ఆ విషయాన్ని ప్రాణం పోయేదాక మర్చిపోడు.
ఇప్పుడు ఈ మాటలు గుర్తు చేయాడానికి ప్రధాన కారణం.. మెగాస్టార్ చిరంజీవి.
అనారోగ్యానికి గురైన తమిళ నటుడు పొన్నంబలం పాలిట దేవుడు అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి.
పొన్నంబలం.. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో ఈ పేరు తెలియని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు.
తనదైన విలనిజంతో.. చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో టాప్ హీరోలందరి సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు పొన్నంబలం.
అనుకోకుండా 2018 తమిళ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఈ క్రమంలోనే రెండు సంవత్సరాల క్రితం నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. దాంతో ఎవరైనా సాయం చేస్తారాని అని వేచి చూశాను అని పొన్నంబలం అన్నాడు.
అప్పుడే నాకు మెగాస్టార్ చిరంజీవి గుర్తుకు రావడంతో.. నా ఫ్రెండ్ ద్వారా నెంబర్ తీసుకున్నాను.
ఆ తర్వాత మెగాస్టార్ కు అన్నయ్య నాకు ఆరోగ్యం బాలేదు. ఏమైనా సాయం చేయండి అని మెసేజ్ పెట్టాను.
మెసేజ్ చేసిన 10 నిమిషాల తర్వాత నాకు అన్నయ్య నుంచి కాల్ వచ్చింది. నేనున్నాను భయపడకు. అంటూ భరసా ఇచ్చారు చిరంజీవి.
చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి నీకు ఫోన్ వస్తుంది. అక్కడికి వెళ్లి అడ్మిట్ అవ్వు అని చెప్పారు.
మెగాస్టార్ చెప్పినట్లుగానే అక్కడి వెళ్లానని, ఒక్క రూపాయి తీసుకోకుండా నాకు వైద్యం చేశారని పొన్నంబలం చెప్పాడు.
ఇక నా వైద్యానికి రూ. 40 లక్షలు ఖర్చు అయ్యిందని, ఆ మెుత్తం డబ్బును చిరంజీవి ఇచ్చారని చెప్పుకొచ్చాడు పొన్నంబలం.