సనాతన ఆచారాలను ప్రజలకు గుర్తు చేయాలని తన పెళ్లి గోమాత సమక్షంలో జరుపుకోవాలని భావించింది.
ఇదే విషయాన్ని వరుడు కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు కూడా సంతోషంగా అంగీకరించారు.
పెళ్లి రోజున మొదట వధూవరులు ఓ గోవుకు ప్రత్యేక పూజాలు నిర్వహించారు.
అలానే గోమాత సమక్షంలోనే వేదమంత్రాల సాక్షిగా ఆ యువజంట వివాహం జరిగింది.
గోవుల ప్రాముఖ్యతను తెలుపుతూ ఈ నూతన జంట చేసిన పనికి అందరూ అభినందించారు.