నగరానికి చెందిన జయలక్ష్మి అనే విద్యార్థిని వరల్డ్‌ చిల్ట్రన్స్‌ పార్లమెంట్‌ ప్రధానిగా వ్యవహరిస్తోంది.

అంతేకాదు! డిగ్రీ చదువుతూనే పలు రకాల సామాజిక సమస్యలపై స్పందిస్తోంది.

గతంలో బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ నుంచి ఓ పురష్కారాన్ని కూడా అందుకుంది.

జయలక్ష్మి సాధించిన విజయాలపై తెలుగు దినపత్రికలో ఓ స్టోరీ వచ్చింది.

జయలక్ష్మి సివిల్స్‌ సాధించటం కోసం ఎంతో శ్రమిస్తోందని, ఇందుకు ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించటం లేదని ఉంది.

 జయలక్ష్మి తల్లిదండ్రులు ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తూ ఉంటారు.

వారికి కూతుర్ని ఉన్నత చదువులు చదివించటం చాలా కష్టం.

ఈ స్టోరీని ప్రముఖ నటుడు జగపతి బాబు తల్లి చదివారు.

జయలక్ష్మికి సహాయం చేయాలని జగపతి బాబుకు చెప్పారు.

దీంతో జగపతి బాబు జయలక్ష్మికి అండగా నిలవటానికి నిర్ణయించుకున్నారు.

 సివిల్స్‌ శిక్షణ కోసం అవసరమైన ఆర్థిక సాయం చేస్తానని జయక్ష్మికి భరోసా ఇచ్చారు.