ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ భాగమైంది. ఫోన్లు లేకుండా ఎవరూ ఉండలేకపోతున్నారు.
నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు ఫోన్లను ఉపయోగిస్తున్నారు.
వీటి ద్వారా కొందరు రోజంతా కాలక్షేపం చేస్తున్నారు. ఈక్రమంలో ఇయర్ ఫోన్ ఉపయోగిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో ఇయర్ ఫోన్స్ వాడకం కూడా ఎక్కువైంది.
కానీ వీటిని రోజూ అదే పనిగా వాడితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇయర్ ఫోన్స్ పెట్టుకుని 15 నిమిషాలకు మించి వాటితో అధిక సౌండ్ తో మ్యూజిక్ వింటే వినికిడి సమస్యలు వస్తాయంట.
వినికిడి శక్తి క్రమంగా తగ్గిపోయి చివరకు చెవుడు వస్తుందట.
ఇయర్ ఫోన్స్ అదే పనిగా వాడటం వల్లన మెదడు పనితీరు మందగించి.. యాక్టివ్గా ఉండలేరట.
ఇలా మెదడు పనితీరు మందగించడంతో పాటు జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుందట.
ఇక చాలా మంది ఇయర్ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుండడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.
పైన చెప్పిన అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే..ఇయర్ఫోన్స్ను అధికంగా ఉపయోగించకూడదు.
పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ను వాడరాదు.
అలా వాడాల్సి వస్తే మధ్య మధ్యలో కొంత బ్రేక్ ఇవ్వడం మంచిది.
లేకుంటే దీని వల్ల జీవితాంతం వినికిడి లోపంతో బాధపడాల్సి వస్తుంది.