2016లో కేంద్రం పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

2016లో కేంద్రం పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

1000 నోట్ల స్థానంలో రూ. 2 వేల నోట్లను ప్రవేశపెట్టింది ఆర్బీఐ.

అయితే 2 వేల నోట్ల ముద్రణకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది.

ఆర్బీఐ కొత్త 2 వేల నోట్ల ముద్రణ నిలిపివేసిందట.

2016 నవంబర్ 8న ఆర్బీఐ 2 వేల నోట్లను ప్రవేశపెట్టింది. అయితే ఆ తర్వాత క్రమకమ్రంగా 2 వేల నోట్ల చలామణి తగ్గిపోయింది.

దీని వెనుక ఉన్న అసలు కారణం ఆర్బీఐ గత 3 ఏళ్లుగా నోట్లను ముద్రించలేదట.

2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో కొత్త 2 వేల నోట్లను ముద్రించలేదట.

RTI (రైట్ టు ఇన్ఫర్మేషన్) కి ఒక వ్యక్తి 2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయా? లేదా? అని అడగగా ఆర్బీఐ ప్రత్యుత్తరం ఇచ్చింది.

ప్రత్యుత్తరం ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,5429.91 కోట్ల 2 వేల రూపాయల నోట్లను ముద్రించినట్టు తెలిపింది.

2017-18 ఆర్థిక సంవత్సరంలో 1115.07 కోట్ల 2 వేల నోట్లను ముద్రించినట్టు పేర్కొంది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో 466.90 కోట్ల నోట్లను మాత్రమే ముద్రించినట్టు తెలిపింది.

2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క 2 వేల నోటు కూడా ముద్రించలేదని తెలిపింది.

అదన్నమాట విషయం.. పెద్ద నోటు చిన్నోళ్ల చేతికి చిక్కకపోవడానికి అసలైన కారణం ఇదే.