కూరన్నం తిన్నాక చివరగా పెరుగన్నం తినాలని అంటారు.

పెరుగు వేసుకుని తింటే మంచిదని అంటారు.

పెరుగులో అనేక పోషకాలు ఉంటాయి. 

పెరుగు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.  

ప్రోటీన్లు, విటమిన్ బి6, బి 12, కాల్షియం వంటివి పెరుగు ద్వారా లభిస్తాయి. 

గ్యాస్ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే పెరుగుతో నయమవుతాయి. 

దంతాలు, గోర్లు, ఎముకలు దృఢంగా ఉండడానికి పెరుగు దోహదపడుతుంది.

పెరుగు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

వేసవి కాలంలో పెరుగు తినడం చాలా మంచిది

అయితే చలికాలంలో పెరుగు తింటే రొంప, జలుబు, కఫం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. 

చలికాలంలో పెరుగు తినడం వల్ల దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 

ఒకవేళ మధ్యాహ్నం తిన్నా గానీ రాత్రి పూట పెరుగు తినకూడదని అంటున్నారు.