గర్భధారణ తర్వాత మహిళలు అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

వారు తినే ఆహారం, ఎన్ని గంటలు రెస్ట్‌ తీసుకోవాలి వంటి అనేక అంశాల గురించి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.

మరీ ముఖ్యంగా గర్భిణిలు ఎప్పుడు కూడా ఎడమవైపు తిరిగి పడుకోవాలని వైద్యులు సూచిస్తారు.

ఇలా ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల.. పిండానికి, గర్భాశయానికి రక్తప్రవాహం కూడా పెరుగుతుంది.

అలానే గర్భంతో ఉన్న వారు నిటారుగా, వీపు మీద పడుకోకూడదు. ఇలా చేస్తే.. కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం.

గర్భిణులు ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల వారికి జీర్ణక్రియ సులభంగా అవుతుంది. 

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల మూత్రపిండాలకు, గర్భాశయానికి రక్తప్రవాహం సులభంగా అవుతుంది. అలానే వెన్ను నొప్పి నుంచి ఉపశమం లభిస్తుంది.

అలానే గర్భిణిలు ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల  ఎసిడిటీ, గుండెల్లో మంట తగ్గుతాయి. గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది అంటున్నారు నిపుణులు.

గర్భిణులు కుడివైపు తిరిగి పడుకుంటే పిండానికి రక్తప్రసరణ తగ్గడమే కాక ప్లాసెంటాకు ప్రతికూలంగా ఉంటుంది.

గర్భిణులు కుడివైపు తిరిగి పడుకుంటే పిండానికి రక్తప్రసరణ తగ్గడమే కాక ప్లాసెంటాకు ప్రతికూలంగా ఉంటుంది.

ఇకపోతే గర్భిణీ స్త్రీలు పడుకునే ముందు నీటిని అస్సలు తాగకూడదు అంటున్నారు నిపుణులు.

ఒకవేళ మంచినీళ్లు​ తాగాలనుకుంటే పడుకోవడానికి మూడు గంటల మందే తాగాలని చెబుతున్నారు. 

అలానే గర్భిణి స్త్రీలు వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే మంచిది. 

ఇక వీరు స్మూత్‌గా ఉండే బెడ్‌పై పడుకోవడం కన్నా.. మంచం మీద పడుకోవడమే ఉత్తమం అంటున్నారు.

మంచం మీద పడుకుంటే.. శరీరానికి అన్ని వైపులా మద్దుతతు లభిస్తుంది.

అలానే కాళ్ల మధ్యలో దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల సౌకర్యవంతంగా ఉంటుంది.

అయితే ఒకే పొజిషన్‌లో  ఎక్కువ సేపు పడుకోకూడదు అంటున్నారు నిపుణులు.