పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి.
అందుకే పండ్లను రోజూ తినాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
అయితే పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదంట.
పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగితే జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది.
పండ్లు తిన్న వెంటనే నీరు తాగటం వలన అజీర్తి , ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
అంతేకాదు నీళ్లను తాగితే పండ్ల ద్వారా గ్రహించిన పోషకాలు శరీర భాగాలకు చేరవు.
పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగడం వల్ల ఎంజైమ్లు, జీర్ణ రసాల పనితీరు సరిగ్గా ఉండదు.
పండ్లు తిని ఆ వెంటనే నీళ్లను తాగితే.. గ్యాస్ సమస్య, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి పండ్లను తిన్న వెంటనే నీళ్లను తాగడం కూడా ఒక కారణమట.
పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగితే..అవి సరిగ్గా జీర్ణం కాకుండా అవి కొవ్వుగా మారుతాయి.
ఊబకాయం, డయాబెటీస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పొట్టలోని జీర్ణ రసాలు పలుచగా అయ్యి తిన్నది సరిగ్గా అరగక గుండెల్లో మంట పుడతుంది.
కాబట్టి మీరు ఎలాంటి పండ్లను తిన్నా.. అప్పుడే నీళ్లను తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు