కివి చూడటానికి సపోట వలె కనిపిస్తుంది కానీ గుడ్డు ఆకారంలో ఉంటుంది.

మన బాడీకి కావాల్సినంత ఎక్కువ పోషకాలను అందించే పండ్లలో కివి పండు ప్రధానమైనదని చెప్పొచ్చు.

ఈ కివి పండుని 'చైనీస్ గూస్ బెర్రీ' అని కూడా పిలుస్తుంటారు.  

కివి పండులో ఉండే పోటాషియం వల్ల మనం గుండె సమస్యల రక్షణ పొందవొచ్చు.

కివి పండును తినడం వల్ల బిపి కూడా చక్కగా కంట్రోల్ అవుతుంది. దీనిలో ఉండే అధిక పోషకాల వల్ల బిపి కంట్రోల్ లో ఉంటుందట. 

కివి పండులో ఉండే యాక్టినిడిన్ అనే ఎంజైమ్ మన శరీరంలో జీర్ణ శక్తిని  పెంచే విధంగా తోడ్పడుతుంది.

కివి పండు తినడం వల్ల కంటి చూపు సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది. కంటి టిష్యూలు, కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

 కివి పండు గుజ్జును షాంపూలా వాడడం వల్ల.. జుట్టు రాలిపోవడం,  తెల్లగా మారిపోవడం లాంటి సమస్యలకు చెక్ పెట్టవొచ్చు

కివి పండు తింటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు.. ఆస్తమా తీవ్రత కూడా తగ్గడానికి సహకరిస్తుంది.

కివి పండులోని విటమిన్ కె, కాల్షియమ్‌లు అదుపు చేయగలుగుతాయి.  

చర్మ రుగ్మతలు, క్యాన్సర్ వంటివి రాకుండా చేస్తుంది

ఇందులో ఉండే.. విటమిన్లు, మినరల్స్ వలన చర్మం పొడిబారకుండా చేస్తుంది.