అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్నే కస్టర్డ్‌ యాపిల్‌ అనీ షుగర్‌ యాపిల్‌ అనీ పిలుస్తారు.

సీతాఫలం ఆకు మొదలుకుని గుజ్జు తిన్న తరువాత పారవేసే గింజల వరకూ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని వైద్యశాస్త్రం చెబుతుంది

ధీర్ఘకాలిక వ్యాధులను నశింపచేసే శక్తి సీతాఫలాంనికి ఉంది.

సీతాఫలం జ్యూస్ లో తేనె మరియు పాలు మిక్స్ చేసి రెగ్యులర్ గా తీసుకోవాలి. ఇది క్యాలరీలను పెంచుతుంది.

గర్భిణీ స్త్రీలు సీతాఫలం తినడం వల్ల పొట్టలో పెరిగే శిశువు యొక్క మెదడు, నాడీవ్యవస్థ, వ్యాధినిరోధకత సమృద్దిగా పెంచడానికి దోహదపడుతుంది.

సీతాఫలంలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది.   డైటింగ్‌ నియమాలు పాటించే వారు సైతం ఈ ఫలాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు. 

పండులోని సల్ఫర్‌ చర్మవ్యాధుల్నీ తగ్గిస్తుంది.

సీతాఫలం గుజ్జు శరీరంలోని క్రిములు, వ్యర్థపదార్థాలను వెలుపలికి పంపించి వేస్తుంది.  

సీతాఫలం లో ఉండే లుటీన్ ,  జియాజాన్థిన్   వయసు తో పాటు వచ్చే కళ్ళకు సంబంధించిన సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది

సీతాఫల పండు మన శరీరం లోని బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది 

సీతాఫలం పండులో మంచి ఆంటియాక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఈ ఆంటియాక్సిడెంట్ గుణాలు మన శరీరాన్ని నష్టపరిచే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది

సీతాఫలంలో ఉండే విటమిన్ C మన చర్మ ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది. విటమిన్ C కొల్లాజిన్ అనే ప్రోటీన్ నిర్మాణం లో సహాయపడుతుంది

ఈ పండు తినటం వల్ల ఎముకలు గట్టిగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది