ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికైనా కాస్త బ్రేక్‌ కావాలి.

బ్రేక్ తీసుకుని ఎక్కడికైనా ఒక నాలుగు రోజులు టూర్‌ వెళ్దాం అనుకుంటారు.

ఎక్కడికి వెళ్లినా మనల్ని కాలుష్యం అనే మహమ్మారి వెంటాడుతూనే ఉంటుంది.

మంచి గాలితో పాటు ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలను కూడా చూడచ్చు. మరి.. అవేంటో చూద్దాం.

అయితే ఇప్పుడు చెప్పుకోబోయే నగరాలకు వెళ్తే మాత్రం మీకు ఎంతో స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది.

అత్యంత స్వచ్ఛమైన గాలి లభించే నగరాల్లో వైజాగ్‌ కూడా ఒకటి. 

వైజాగ్ లో బొర్రా గుహలు, కటికి జలపాతం, సబ్‌ మెరైన్ మ్యూజియం, అరకు, రుషికొండ వంటివి చూడచ్చు.

కొచ్చి.. స్వచ్ఛమైన గాలి ఉండే నగరాల్లో కేరళలోని కొచ్చి కూడా ఒకటి.

కేరళకు సంప్రదాయ, సంస్కృతులకు కొచ్చి క్యాపిటల్‌ లాంటిదని చెప్పొచ్చు.

కర్ణాటకలోని మైసూర్.. బెస్ట్‌ ఎయిర్‌ క్వాలిటీ ఉన్న నగరాల్లో మైసూర్‌ కూడా ఒకటి.

ఇక్కడ మైసూర్‌ ప్యాలెస్‌ తో పాటుగా మరికొన్ని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.

మిజోరాం రాజధాని ఐజ్వాల్ అత్యంత స్వచ్ఛమైన గాలి ఉండే ప్రాంతాల్లో ఒకటి.

ఇక్కడ అటవీ అందాలు, జలపాతాలు, నదీ సోయగం వంటివి ఎన్నో చూడచ్చు.

మాంచెస్టర్ ఆఫ్‌ సౌత్ ఇండియాగా పేరు గాంచిన కోయంబత్తూరు కూడా స్వచ్ఛమైన గాలి ఉండే ఒక ప్రాంతం.

ఇక్కడ మరుధమలై ఆలయం, కోవై కొడట్టం, ఆదియోగి విగ్రహం, వైదేహీ జలపాతం వంటివి చూడచ్చు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి